తెలంగాణ

తెలంగాణ


హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బోనం సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణతో బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన పీవీ సింధుకు మేళతాళాలతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు. 2015 సంవత్సరం నుంచి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

వీడియో చూడండి:



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *