కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ద కథ కూడా కాదు.. కానీ ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా..? అది సైలెంట్గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సినిమా ఎదో తెలుసా.?
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
గత ఏడాది చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలానే విడుదలయ్యాయి. పుష్ప 2, కల్కి 2898 AD లాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులోనే కాదు బాలీవుడ్, తమిళ్ లోనూ ఎన్నో బడా సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలు ఏవీ అందుకోలేని ఓ రికార్డ్ ను ఓ చిన్న సినిమా అందుకుంది. ఆ సినిమా ఎదో కాదు తమిళ్ లో తెరకెక్కిన మెయియఝగన్. ఇదే సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్ను అందించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 8.4 IMDb రేటింగ్తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.